Sunday, May 19, 2024

ఏపీలో కొత్తగా 4981 కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య నిర్దిష్టంగా నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 88,622 సాంపిల్స్ ని పరీక్షించగా 4,981 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. అలాగే కోవిడ్ వల్ల చిత్తూర్ లో పది మంది, తూర్పు గోదావరి లో ఐదుగురు, కృష్ణ లో ఐదుగురు,గుంటూరు లో నలుగురు, నెల్లూరు లో నలుగురు, శ్రీకాకుళం లో ముగ్గురు, పశ్చిమ గోదావరి లో ముగ్గురు, అనంతపూర్ లో ఒక్కరు, వైఎస్ఆర్ కడప లో ఒక్కరు, విశాఖపట్నం లో ఒక్కరు మరియు విజయనగరం లో ఒక్కరు మరణించారు.

గడచిన 24 గంటల్లో 6,464 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. అలాగే నేటి వరకు రాష్ట్రంలో 2,14,49,636 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.

మొత్తం కేసుల సంఖ్య…1867017
యాక్టీవ్ కేసుల సంఖ్య…49683
డిశ్చార్జ్ కేసుల సంఖ్య…1804844
మరణాల సంఖ్య….12490

Advertisement

తాజా వార్తలు

Advertisement