Thursday, May 2, 2024

ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల

ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్‌ను గురువారం నాడు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. మెడికల్ పరీక్షలు నీట్ పరిధిలోకి వెళ్ళడంతో EAMCETను ఇక నుంచి EAPCETగా పిలవనున్నారు. EAPCET-2021 పరీక్షలు 2021, ఆగస్ట్ 19 నుంచి ఆగస్ట్ 29 వరకు జరపాలని ప్రతిపాదించారు. EAPCET ద్వారా ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ జూన్ 26, ఆన్‌లైన్ దరఖాస్తు చేయడానికి ఆలస్య రుసువు లేకుండా చివరి తేదీ: జులై 25. ఆలస్య రుసువుతో ఆన్‌లైన్ దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఆగస్ట్ 6 నుంచి ఆగస్టు10 వరకు రూ.1000, ఆగస్టు 11 నుంచి ఆగస్టు 15 వరకు – రూ.5000, ఆగస్టు16 నుంచి ఆగస్టు 18 వరకు: రూ.10,000. కాగా ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement