Saturday, April 27, 2024

కొత్తగా 457 మందికి కరోనా.. 4747కు చేరిన యాక్టివ్‌ కేసులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 457 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు తెలంగానలో 8, 02, 379 మందికి కరోనా బారిన పడ్డారు. కరోనా నుంచి కోలుకోవడంతో 494 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనాతో రాష్ట్రంలో 4747 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

తాజాగా 22, 384 మంది కి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తాజా కేసుల్లో 285 కేసులు హైదరాబాద్‌ నగరంలోనే నమోదయ్యాయి. కరీంనగర్‌లో 12, ఖమ్మంలో 10, మేడ్చల్‌లో 27, రంగారెడ్డిలో 25, సంగారెడ్డిలో 35 కేసులు నమోదయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement