Monday, May 13, 2024

ఉక్రెయిన్​ నుంచి స్వదేశానికి 377 మంది తెలంగాణా విద్యార్థులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు విడతల వారీగా పొరుగు దేశాల నుంచి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 26వ తేదీ నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 47 ప్రత్యేక విమానాల్లో 377 మంది తెలంగాణా విద్యార్థులు ఢిల్లీ, ముంబైకి వచ్చారు. ఎయిర్‌పోర్టులలో దిగిన వారిని స్వస్థలాలకు చేర్చేలా తెలంగాణా ప్రభుత్వం ఢిల్లీ, ముంబైలలో ఏర్పాట్లు చేసింది. విమానాలలో హైదరాబాద్ తరలించి అక్కణ్నుంచి సొంత ఊళ్లకు పంపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement