Friday, April 26, 2024

13ఏళ్ల బాలిక అదృశ్యం.. మాన‌సిక ప‌రిస్థితి బాగోలేద‌ని తల్లిదండ్రుల ఆందోళ‌న‌

క‌వాడిగూడ‌లో 13ఏళ్ల బాలిక అదృశ్య‌మైంది.కాగా ఆ బాలిక మాన‌సిక ప‌రిస్థితి స‌రిగ్గా లేద‌ని త‌ల్లిదండ్రులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. బాలిక మిస్సింగ్ పై పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.నిన్న ఉదయం బయటకి వెళ్ళిన బాలిక అదృశ్యం ఘటన కలకలం రేపుతోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలిక ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కవాడిగూడలో బాలిక ఆటో ఎక్కినట్టు గుర్తించారు. ఆటోను ట్రేస్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే స్నేహపురి కాలనీలో బాలిక ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేశారు. సిగ్నల్స్ ఆధారంగా రెండు బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement