Sunday, April 28, 2024

సామాజిక సేవలో పారగాన్ సంస్థ సేవలు అభినందనీయం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ప‌టాన్ చెరు : సామాజిక సేవలో పారగాన్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ మార్క్స్ నగర్ లో పారగాన్ సంస్థ సౌజన్యంతో 83 లక్షల రూపాయల సీఎస్ఆర్ నిధులతో చేపడుతున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రం నూతన భవనాల నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే జీఎంఆర్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ లు కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరుందిన పటాన్ చెరు నియోజకవర్గంలో ప్రభుత్వం అందించే నిధులతో పాటు పరిశ్రమలు సామాజిక బాధ్యతా కార్యక్రమం ద్వారా అందిస్తున్న నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. పారగాన్ సంస్థ యాజమాన్యం సామాజిక బాధ్యతలో భాగంగా ఇప్పటికే రామచంద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు పటాన్చెరులోని ఏరియా ఆసుపత్రిలో లక్షల రూపాయల వ్యయంతో అధునాతన శస్త్ర చికిత్స పరికరాలను అందించిందని తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే స్పూర్తితో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. ఆధునిక వసతులతో పాఠశాల భవనంతో పాటు అంగన్వాడి కేంద్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement