Sunday, April 28, 2024

ఏపీలో తగ్గని మరణాలు….కొత్తగా 118 మరణాలు

ఏపీలో గత వారంగా 20 వేలకు పైగా కేసులు నమోదు కాగా గడిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో మాత్రం కేసులు తగ్గుముఖం పట్టాయి. మొత్తం 90వేల‌కుపైగా టెస్ట్ లు చేయగా 19,981 కొత్త పాజిటివ్ గా కేసులు నమోదు అయ్యాయి. మ‌రోవైపు కరోనా కారణంగా 118 మంది మృతి చెందారు. ఇక తాజా గణాంకాల ప్రకారం…ఏపీ వ్యాప్తంగా ఇప్పటివరకు 1.85కోట్లకు పైగా పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 15.62 ల‌క్ష‌ల‌ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

అలాగే ఇందులో 13.41 ల‌క్ష‌ల మంది కరోనా నుంచి కొలుకున్నారు. ఇక క‌రోనాబారిన‌ప‌డి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 10,022 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2.10 లక్ష‌ల యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement