Monday, May 27, 2024

హైదరాబాద్ : నటుడు మోహన్ బాబుకు జీహెచ్ఎంసీ రూ.లక్ష జరిమానా

సినీ నటుడు వెూహన్‌బాబుకు జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది.   నిబంధనలకు విరుద్ధంగా తన నివాసానికి హోర్డింగ్‌ పెట్టడమే కాకుండా దానికి లైటింగ్‌ అమర్చినందువల్లే జరిమానా విధించినట్లు జీహెచ్ఎంసీ  అధికారులు తెలిపారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 1లోని తన ఇంటి ఆవరణలో సినిమా ప్రకటన బోర్డును వెూహన్‌బాబు ఏర్పాటు చేశారు. అయితే నిర్దేశించిన ప్రమాణాలకు మించి 15 అడుగుల ఎత్తులో ఈ హోర్డింగ్ ఉందని  అధికారులు ఆయనకు పంపించిన నోటీసులో పేర్కొన్నారు.   ప్రస్తుతం వెూహన్‌బాబు సన్నాఫ్‌ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో దేశ రక్షణ కోసం పోరాడే వ్యక్తిగా కనిపించనున్నాడు.   ఈ చిత్రానికి డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు.  ఇళయారాజా సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement