Monday, June 17, 2024

AP : హాజ్‌యాత్ర‌కు బ‌య‌లుదేరిన తొలిబృందం

ఆంధ్రప్రదేశ్‌ నుంచి హజ్‌-2024 యాత్ర నేడు బ‌య‌లుదేరారు.. రాష్ట్రం నుంచి ఈ ఏడాది 2, 580 మంది హాజీల పవిత్ర యాత్రకు ఎంపిక‌య్యారు.. వారిలో322 మందితో కూడిన తొలి జ‌ట్టు నేటి ఉద‌యం ఉదయం 8 : 45 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో బ‌య‌లుదేరారు… మొదటి విమానంలో ప్రయాణించే 322 మంది హజ్‌ క్యాంపు నుంచి ఉదయం 3. 30 గంటలకే గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకునున్నారు.

- Advertisement -

కాగా, హజ్ యాత్రకు వెళ్లే వారి సౌకర్యం కోసం గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఈద్గా జామా మసీదు దగ్గర మదర్సాలోని హజ్‌ వసతి క్యాంపులో ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి హజ్‌ క్యాంపు వద్దకు చేరుకున్న తొలి బృందానికి వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. 24 గంటలు పనిచేసేలా మదర్సా దగ్గర మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేశారు. వ్యాక్సినేషన్, వైద్య సహాయం అందించేలా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. మదర్సా వద్ద పరిశుభ్రమైన వాతావరణంలో టెంట్లు, ఎయిర్‌ కూలర్లు సిద్ధం చేసి నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకున్నాట్లు ప్రకటించారు. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో నలుమూలల నుంచి 2580 మంది ముస్లిం సోదరులు ప్రపంచవ్యాప్తంగా హజ్ యాత్రకు పేర్లు నమోదు చేసుకోగా, మొదటి విడతలో భాగంగా ఈరోజు 322 మంది గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు..

తొలిజ‌ట్టు స‌భ్యుల‌తో కూడిన బ‌స్సుల‌ను పవిత్ర హాజ్ యాత్రను రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి, చైర్మన్ హాజ్ ఆపరేషన్స్ హర్షవర్ధన్ సోమవారం తెల్లవారుజామున గన్నవరం ఈద్గా జామా మసీదు హాజ్ క్యాంపు నుండి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. వక్ఫ్ బోర్డు సీఈవో , హాజ్ కమిటీ ఈవో అబ్దుల్ ఖదీర్ మరియు హాజ్ కమిటీ సభ్యులు సి ఆర్ డి ఏ అదనపు కమిషనర్ అలీం భాష, దూదేకుల కార్పొరేషన్ ఎండి గౌస్ పీర్, ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్వలి తదితరులు హాజ్ యాత్రికులకు అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement