Sunday, June 9, 2024

Chennai : ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు ఈ మెయిల్..

త‌మిళ‌నాడు రాష్ట్రంలోని చెన్నై ఎయిర్‌పోర్టుకు ఆగంతకులు ఈ మెయిల్ పంపారు. అందులో మరో వారం రోజుల్లోగా విమానాశ్రయాన్ని పేల్చేస్తామని మెసేజ్ ఇచ్చారు. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యయి. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో అణువనువు సోదాలు చేస్తున్నారు.

పార్కింగ్, రన్‌ వే, ఇంటర్నేషనల్ డిపార్చర్, డొమెస్టిక్ డిపార్చర్ విభాగాల్లో బాంబులు ఏమైనా ఉన్నాయా అని గాలిస్తున్నారు. కాగా, ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీయగా.. నకలీ వెబ్‌సైట్ నుంచి ఆగంతకుడు మెయిల్ పంపినట్లుగా తెలుస్తోంది. ఇది డ్రగ్స్ ముఠా పని అయి ఉండొచ్చిన ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement