Friday, April 26, 2024

సీతమ్మ పాదాలు సేఫ్.. కట్టుకథలు ఆపండి..!

గుంటూరు జిల్లా యడ్లపాడులో సీతమ్మ పాదాల చెంతన శిలువ నిర్మాణం చేపట్టారని సోషల్ మీడియాలో బీజేపీ నేతలు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, సునీల్ డియోధర్ కొన్ని ఫోటోలను వైరల్ చేయడంపై గుంటూరు రూరల్ పోలీసులు స్పందించారు. ఇందులో నిజం లేదని వారు నిర్ధారించారు. యడ్లపాడులో రెండు వేర్వేరు కొండలపై సీతమ్మ పాదాలు, శిలువ ఉన్నాయని వారు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఓ వీడియోను వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రేమ, ఆప్యాయత, శాంతిని పంచుకోవడానికే ట్విట్టర్‌ను వాడాలని, ఇతరులను రెచ్చగొట్టడానికి కాదని పోలీసులు హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement