Thursday, April 25, 2024

ఇదే నారాయణ మంత్రం..!

ఎవరూ ఊహించని వింత చోటుచేసుకుంది. కరుడుగట్టిన కమ్యూనిస్ట్.. దేవుడు, స్వామిజీలు అంటే నమ్మకం లేని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సడెన్‌గా రూటు మార్చారు. ఆయన ఏకంగా విశాఖ శారదా పీఠాధిపతిని కలిసి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. గతంలో పలువురు ప్రజాప్రతినిధులు పీఠాధిపతులను దర్శించుకున్న సమయంలో వారిపై విమర్శలు చేసిన నారాయణ స్వయంగా ఇప్పుడు శారదా పీఠాధిపతిని కలవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన స్వరూపానందేంద్రను ఏం వరాలు కోరారోనని అందరూ ఆసక్తిగా చర్చించుచుకుంటున్నారు. అయితే ఏపీ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగానే నారాయణ స్వరూపనందేంద్ర స్వామిని కలుసుకున్నట్లు తెలుస్తోంది. జీవీఎంసీలో ఆయన సీపీఐ అభ్యర్థి తరపున మూసివాడలో ప్రచారం చేసిన ఆయన పక్కనే ఉన్న శారదా పీఠాన్ని సందర్శించారు. తమ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించిన నారాయణ పనిలో పనిగా స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement