Wednesday, May 22, 2024

విశాఖలో రాత్రికి రాత్రే టీడీపీ నేత భవనం కూల్చివేత

విశాఖలోని గాజువాక సెంటర్‌లో టీడీపీ నేత పల్లా శ్రీనివాస్‌కు చెందిన భవనాన్ని విశాఖ మున్సిపల్ అధికారులు కూల్చి వేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణం చేపట్టారన్న ఆరోపణల కారణంగానే భవనాన్ని కూల్చివేసినట్లు తెలుస్తోంది. అయితే నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని ఎలా కూలుస్తారని పల్లా శ్రీనివాస్ ప్రశ్నించారు. అర్ధరాత్రి సమయంలో భవనాన్ని కూల్చివేయడం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని పల్లా శ్రీనివాస్ ఆరోపించారు. కాగా తాము గతంలోనే నోటీసులు ఇచ్చామని జీవీఎంసీ అధికారులు చెప్తున్నారు. భవనం కూల్చివేత విషయం తెలుసుకుని పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు రావడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పల్లా శ్రీనివాస్‌ను బలవంతంగా పోలీసులు ఘటనా స్థలం నుంచి పంపించేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement