Friday, May 17, 2024

తమిళనాడులో నేడు సంపూర్ణ లాక్‌డౌన్

తమిళనాడు వ్యాప్తంగా ఆదివారం నాడు సంపూర్ణ లాక్‌డౌన్ అమలవుతోంది. ఉదయం ప్రారంభమైన లాక్‌డౌన్ రాత్రి పది గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సంపూర్ణ లాక్‌డౌన్ కారణంగా ప్రజలు రోడ్లపైకి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1.20 లక్షల మంది పోలీసులు మోహరించారు.

అటు తమిళనాడులో లాక్‌డౌన్ అమలవుతుండడం ఏడు నెలల తర్వాత ఇదే తొలిసారి. గతేడాది సెప్టెంబరు నుంచి ఇప్పటి వరకు వివిధ ఆంక్షల నడుమ కార్యకలాపాలు సాగుతుండగా నేడు పూర్తిగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. అయితే ప్రసార మాధ్యమాలు, పాలు, మందులు తదితర అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు. అంబులెన్స్‌లు, రోగులను తరలించే వాహనాలకు మాత్రం లాక్‌డౌన్ నుంచి సడలింపు ఇచ్చారు. కాగా ఏపీ, కర్ణాటక, కేరళ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు తప్పనిసరిగా ఈ-పాస్ పొందాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నుంచి థియేటర్లు, క్లబ్‌లు, బార్లు, జిమ్‌లు, రిక్రియేషన్ క్లబ్‌లు, వ్యాపార సముదాయాలు, షాపింగ్ మాళ్లను మూసివేయాలని స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement