Monday, May 13, 2024

మొతేరా : భారత్ తో 3వ టెస్టు : తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 112 ఆలౌట్

ఇంగ్లాండ్ తో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా మొతేరా వేదికగా ఈ  రోజు మొదలైన  మూడో టెస్టులో టీమ్ ఇండియా సత్తా చాటుతోంది. తొలుతటాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 112 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్పిన్నర్ అక్షర్ పటేల్ అద్భుతంగా రాణించి ఆరు వికెట్లు పడగొట్టాడు.అతడికి అశ్విన్ నుంచి మంచి సహకారం అందింది. అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. వందో టెస్టు ఆడుతున్న ఇషాంత్ శర్మకు ఒక వికెట్ దక్కింది. డేనైట్ టెస్టుగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలి రోజే భారత స్పిన్నర్లు విజృంభించడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ లో ఒక్క జాక్ క్రావ్లే మాత్రమే భారత బౌలర్లను ప్రతిఘటించి హాఫ్ సెంచరీ సాధించాడు. క్రావ్లే 53 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. మిగిలిన బ్యాట్స్ మెన్ ఎవరూ నిలదొక్కుకోలేకపోయారు. ఇంగ్లాండ్  ఇన్నింగ్స్ లో ముగ్గురు డకౌట్ కాగా, రూట్, బెన్ ఫోక్స్, ఆర్చర్ మినహా మిగిలిన ఎవరూ కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేదంటే భారత బౌలర్లు ఎంతగా ఆధిపత్యం చెలాయించారో అర్ధం చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement