Thursday, May 16, 2024

న్యూఢిల్లీ : మార్చి 1 వరకూ ఫాస్టాగ్ ఫ్రీ

కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు ఫాస్టాగ్‌ విషయంలో తీపి కబురు అందించింది. ఉచితంగానే ఫాస్టాగ్‌ అందిస్తున్నట్టు ప్రక టించింది. ఈ విషయాన్ని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. 2021, మార్చి 1 వరకు దేశ వ్యాప్తంగా ఉన్న 770 టోల్‌ ప్లాజాల్లో (స్టేట్‌ ప్లాజాలతో సహా) ఉచితంగానే ఫాస్టాగ్‌ పొందొచ్చని ఎన్‌హెచ్‌ ఏఐ తెలిపింది. దీంతో వాహనదారులకు రూ.100 ఆదా కానుంది. జాతీయ రహదారులపై నడిచే వాహనాల యూజర్ల ఫాస్టాగ్‌ విని యోగించడాన్ని పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఫాస్టాగ్‌ను 87 శాతం మంది మా త్రమే వినియోగి స్తున్నారు. కేవలం రెండు రోజుల్లోనే ఫాస్టాగ్‌ విని యోగం 7 శాతం పెరిగింది. ఇక దేశంలో 100టోల్‌ ప్లాజాలా దగ్గర ఫాస్టాగ్‌ వినియో గించే వారి సంఖ్య 90 శాతం చేరుకుంది. ఒక్క రోజు లోనే ఫాస్టాగ్‌ ద్వారా 63 లక్షల లావాదేవీలతో రూ.100 కోట్ల టోల్‌ వసూలు చేశారు. టోల్‌ప్లాజా దగ్గర ఏదైనా సాంకేతిక లోపం ఉంటే.. ఫాస్టాగ్‌లలో బ్యాలెన్స్‌ ఉన్నంత వరకు ఒక్క పైసా కూడా చెల్లించ కుండా వినియోగదారులు టోల్‌ ప్లాజాలు దాటొచ్చు అని ఎన్‌హెచ్‌ ఏఐ అధికారులు తెలిపారు. గత రెండు రోజుల్లో 2.5లక్షలకు పైగా ట్యాగ్ల అమ్మకాలు జరిగాయని ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement