Thursday, May 16, 2024

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 13, 993 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 13, 993 మందికి కరోనా సోకింది. అదే సమయంలో కరోనా కాటుకు 101 మంది మృత్యు ఒడికి చేరారు. దీంతో దేశంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,09,77,387కు చేరింది. కరోనా మృతుల సంఖ్య 1,56,212కు పెరిగింది. ప్రస్తతం దేశంలో 1,43,127  కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement