Friday, April 26, 2024

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 6 క్రస్టు గేట్ల ఎత్తి దిగువకు నీరు విడుదల..

గులాబ్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షాలకు తోడు ఎగువ నుండి కూడా కొంత ప్రవాహం వస్తుండటంతో నాగార్జున సాగర్ కు మళ్ళీ వరద పోటెత్తింది. అయితే ఇప్పటికే సాగర్ నిండు కుండ లా మారింది. దాంతో సాగర్ ప్రాజెక్ట్ 6 క్రస్టు గేట్ల ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. సాగర్ జలాశయానికి 63,080 క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లో ఉండగా ప్రాజెక్ట్ 6 క్రస్టు గేట్లను ఎత్తి అవుట్ ఫ్లో గా 90,563 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండగా… ప్రస్తుతం 589.90 అడుగులకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 ఉండగా… సాగర్ లో ప్రస్తుతం 311.7462 టీఎంసీలు నీరు ఉంది.

ఇది కూడా చదవండి: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నేటి రేట్లు ఇలా..

Advertisement

తాజా వార్తలు

Advertisement