Tuesday, March 26, 2024

టాలీవుడ్‌కు కొత్త కళ… అక్టోబరులో లైన్ కట్టిన సినిమాలు

టాలీవుడ్‌లో దసరాకు బాక్సాఫీస్ దగ్గర వార్ గట్టిగానే ఉండనుంది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తరువాత తెలుగు రాష్ట్రాలలో ఎగ్జిబిషన్ పరిశ్రమ తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది. ఇటీవల కాలంలో అనేక సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని రికార్డు స్థాయిలో కలెక్షన్లను కూడా రాబట్టాయి. ఏపీలో టికెట్ ధరల సమస్య అడ్డంకిగా ఉన్నప్పటికీ టాలీవుడ్ అక్టోబర్‌లో వార్ కోసం సిద్ధమవుతోంది. సాయి తేజ్ ‘రిపబ్లిక్’ ఈ నెలలో మొదటిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అతడి సోదరుడు వైష్ణవ్ తేజ్ రెండవ చిత్రం ‘కొండ పొలం’తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడు. ఈ చిత్రం అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనికి క్రిష్ దర్శకత్వం వహించగా, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం అప్‌డేట్లకు మంచి స్పందన వచ్చింది.

మరోవైపు దసరా వారాంతంలో భారీ సంఖ్యలో సినిమాల ఉంటుంది. శర్వానంద్, సిద్ధార్థ్ మల్టీస్టారర్ ‘మహాసముద్రం’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం అక్టోబర్ 14న విడుదలవుతుంది. అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అక్టోబర్ 15న రిలీజ్ అవుతోంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ ‘పెళ్లి సందడి’ కూడా అక్టోబర్ 15 న విడుదలకు సిద్ధమవుతోంది. నాగ శౌర్య నటించిన ‘వరుడు కావలెను’ సినిమా అక్టోబర్ 22 న విడుదలకు సిద్ధమవుతోంది. దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ ‘రౌడీ బాయ్స్‌’తో అరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 29న విడుదలయ్యే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement