Thursday, March 28, 2024

పవన్‌కు కాల్షీట్లు లేకపోతే రాజకీయాలు గుర్తుకువస్తాయి: మంత్రి శంకర్ నారాయణ

తిరుమల శ్రీవారిని శుక్రవారం నాడు మంత్రి శంకర్ నారాయణ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్‌కు సినిమా కాల్షిట్లు లేకపోతే రాజకీయలు గుర్తుకు వస్తాయని ఆయన ఆరోపించారు. టీడీపీ, జనసేన ఉనికి కోల్పోతున్న నేపథ్యంలో రోడ్లపై రాజకీయాలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వం రోడ్ల నిర్వహణ నిధులు పక్కదారి పట్టించడంతోనే రోడ్లకు ఈ దుస్థితి వచ్చిందన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు అవగాహన లేక కేంద్ర నిధులు పక్కదారి పట్టాయని విమర్శిస్తున్నారని శంకర్ నారాయణ అన్నారు. వచ్చే ఏడాది మే లోపు రోడ్లు మరమత్తు పనులు పూర్తి చేసేలా టెండర్లు పిలుస్తున్నామని తెలిపారు. ఇక జేసీ బ్రదర్స్‌ను ప్రజలు ఎప్పుడో పక్కన పెట్టేశారని.. వారు మదం ఎక్కి మాట్లాడుతున్నారని విమర్శించారు. వారి వ్యవహార శైలితో చంద్రబాబు తలపట్టుకుంటున్నాడని మంత్రి శంకర్ నారాయణ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement