Friday, April 26, 2024

BREAKING: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో దంతెవాడ జిల్లాలో జవాన్‌లకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అతడు మావోయిస్టు మిలీషియా కమాండర్ వెట్టి హుంగాగా గుర్తించారు. అతడిపై రూ.లక్ష రివార్డు ఉంది. మరికొందరు మావోయిస్టులు కూడా ఈ ఘటనలో మరణించారని అధికారులు భావిస్తున్నారు. కాగా కాల్పులు జరిగిన ప్రాంతంలో 8 ఎంఎం పిస్టల్, నాటు తుపాకీ, రెండు కిలోల ఐఈడీ టపాసులు, మరికొన్ని వస్తువులను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement