Saturday, April 27, 2024

శివాంస సంభూతుడు ఆంజనేయుడురామ భక్తుడిగా ఎందుకు మారాడు

మన పురాణాలు విష్ణు వు హృదయం శివుడు. శివుని హృదయం విష్ణువు అని చెబు తున్నాయి. శివుడు రామ భక్తు డు. పార్వతీదేవికి ‘శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే సహస్రనామ తత్తు ల్యం రామనామ వరాననే” అని రామతత్త్వాన్ని మహాశివుడే చెప్పాడు. కాశీలో మరణించి న ప్రాణుల కుడిచెవిలో విశ్వే శ్వరుడు రామ తారక మం త్రం చెబుతాడట.
హనుమ త్సం హితలో శంకరుడే రామసేవా కాంక్షతో హనుమంతునిగా జన్మించా డని చెప్పబడింది.
పార్వతీదేవితో పరమేశ్వ రుడు ”దేవీ! రావణుడు తన పది తలలు కోసి అగ్నిలో వేసి… దశరుద్రుల కరుణకు పాత్రుడు అయ్యాడు. ఏకాదశ రుద్రుని ఉపేక్షిం చినాడు. నా అంతరంగిక భక్తుడైన నందీశ్వరుని రావణుడు హేళన చేశాడు. కావున రావణుని శిక్షించడానికి ఏకాదశ రుద్రాంశతో నేనే రామభక్తుడైన హనుమంతునిగా పుట్టి రావణుని శిక్షిస్తాను. నన్ను అవమానించినా భరిస్తాను గాని నా భక్తుని అవమానిస్తే భరించలేను” అని చెబుతాడు.
అలా శంకరుడే హనుమంతుడి రూపంలో జన్మించాడు. అకార ఉకార మకరాలు కలిస్తే ఓంకా రం అనే ప్రణవం ఏర్పడుతుంది. అందు ‘అకారో విష్ణు’ అని చెప్పబడింది.
శ్రీకృష్ణుడు ‘అక్షరాణాం’, ‘అ’ కారోస్మి అన్నారు. అంటే ‘అ’ విష్ణు బీజం. ‘మకారాక్షర సంభూత: శివస్తు హనుమాన్‌ స్మృత:” అని తారసారోప ఉపనిషత్తు చెబుతుంది. కనుక శివ విష్ణువులు ఇద్దరు ఓంకార స్వరూపులే అని అర్థం చేసుకోవాలి. తనను తాను ఎలాగు దైవంగా భావించి పూజించు కోలేడు కాబట్టి హనుమంతుడి అవతారం అయిన పరమ శివుడు శ్రీరామచంద్రుడి రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువుకు భక్తుడిగా మారాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement