Tuesday, May 14, 2024

రాత్రిపూజలందుకునే వారాహిదేవి

మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్త మాతృకాలు. వీరే బ్రాహ్మ, మాహశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహ, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసిం హనీ మరికొన్ని సంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయ కిని ఆరాధించడం జరుగుతోంది. దుష్టశిక్షణ కోసమూ, భక్తులకు కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. వీరిలో ఒకరు వారాహి అమ్మవారు.

వరా#హుని స్త్రీతత్వం..

పూర్వం హరణ్యాక్షుడనే రాక్షసుని సం#హ రించి, భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహ మూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహ అంటా రు. దేవీ భాగవతం, మార్కండేయ పురా ణం, వరాహ పురాణం వంటి పురాణా లలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులువంటి రాక్షసులను సంహ రించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపి స్తుంది.
రూపం..

వారాహ రూపం ఇంచుమించు వరాహ మూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరా హ ముఖంతో, ఎనిమిది చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో… శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది.
ఆరాధన..

వారాహిదేవిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు పూజిస్తారు. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహమాత. అందుకే ఈమెను రాత్రివేళల్లో పూజించడం కద్దు. వారాహమాత ముఖ్య దేవతగా ప్రతిష్టించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళల్లోనో, తెల్లవారుజామునో మాత్రమే ఉం టుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి (ఒడిశా), వార ణాసి, మైలాపుర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ. ఈమెను లక్ష్మీదేవి స్వరూ పంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు మనిషి రూపం లో పూజి స్తారు. బౌద్ధమతం వారు కొలిచే వజ్రవారాహి, మరీచి ఈమె ప్రతిరూపాలే అని భక్తుల నమ్మకం.

- Advertisement -

సైన్యాధ్యక్షురాలు..

లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు, భక్తులకు అండ గా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహ. ఈమెను ఆరాధిస్తే జీవి తంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందనీ, కుండలినీ శక్తి జాగ్‌తమవుతుందనీ… తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహదేవి పేర ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలనూ పఠిస్తే సకలజయాలూ సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమ య్యే విషయం. వారాహదేవికి ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవరాత్రులు జరుపుతారు. వివిధ ప్రాంతాలలో వీటిని ఆషాఢ నవరాత్రి అని, గుహ్యనవరాత్రి, గుప్త నవరాత్రి అని అంటారు. ఒరి స్సాలోని చౌరాసీలోని వారాహి ఆలయంలో, బెంగళూరులోని ఉల్సార్‌లో వున్న మహావారాహి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. ఈనెల (జూన్‌) 30వ తేదీ మొదలై జులై 8వ తేదీ తో ముగుస్తాయి.
– దైతా నాగపద్మలత

Advertisement

తాజా వార్తలు

Advertisement