Saturday, April 27, 2024

ఫిబ్రవరి 28న యాదాద్రీశుడి తిరుకల్యాణం

యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానున్నాయి. 28వ తేదీన తొలిసారిగా ఆలయ మాఢ వీధిలో నిర్వహించనున్న శ్రీ స్వామి, అమ్మవార్ల తిరు కల్యాణ మహోత్సవంలో పాల్గొనే భక్తులకు టికెట్ ధరను రూ.3000గా నిర్ణయించినట్లు దేవస్థానం ఈవో ఎన్.గీతారెడ్డి ఒక‌ ప్రకటనలో తెలిపారు. ఒక్క టికెట్ పై ఇద్దరికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. కొండపైన ప్రధాన బుకింగ్ కార్యాలయంతో పాటు ఆల్ లైన్ లో కూడా టికెట్ ను బుక్ చేసుకునేందుకు దేవస్థానం అవకాశం కల్పించింది. యాదాద్రి ఆలయ పునర్ ప్రారంభం అనంతరం జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement