Thursday, May 16, 2024

కార్తిక స్నానం ఎలా చేయాలి

సనాతన హందూ మతం ప్రకారం.. స్నానానికి గొప్ప స్థానం ఉంది. అందులోనూ సముద్ర స్నానానికి, పుణ్యక్షేత్రాల్లో నదీ స్నానానికి కూడా ప్రత్యేక రోజులు ఉన్నాయి. ఇవాళ మనం ఆశ్వయుజ మాసం పౌర్ణమి నుండి కార్తిక మాసం చివరి వరకు చేసే కార్తిక స్నానం గురించి తెలు సుకుందాం.
దీపావళి పండుగ మరుసటిరోజు కార్తిక శుక్ల పాడ్యమి నుంచి కార్తిక బహుళ అమావాస్య వరకు ఒక నెల పాటు తీర్థ స్నానం చేయడం వలన ఆధ్యాత్మిక పరంగా చాలా శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ మాసంలో, సూర్యోదయానికి ముందు రెండు ఘడియలు అంటే సుమారు ఒక గంట ముందు చేసే తీర్థ స్నానాన్ని కార్తిక స్నానం అంటారు. పుణ్య క్షేత్రాలకు వెళ్లడం అసాధ్యమనుకుంటే.. పుణ్యక్షేత్రాల నుంచి తీసుకు వచ్చిన నీటిని ఉపయోగించి స్నానం చేయొచ్చు.
అయితే దీనికి ముందు ఒక మంత్ర పఠించాలి. ‘మహావిష్ణో: అనుగ్రహ ప్రాప్త్యర్థం తీర్థ స్నానం కరి ష్యే’ అని జపించి స్నానం చేయాలి.
‘పవిత్ర కార్తిక ప్రాత:స్నానం కరిష్యే’ అని చెప్పి నీళ్ళు వదలాలి.

కార్తిక స్నానం

ఏ మాసానికి లేని ప్రత్యేకమైన ఆచారం తెల్లవారు ఝామున చల్లనీటి స్నానం. దీనివెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. శరదృతువులో చివరి భాగంలో వచ్చే కార్తికంలో చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు. వర్షరు తు ప్రభావం కనుమరుగై శీతాకాలానికి మధ్య సంధికాలంగా ఉండే సమ యం ఇది. ఈ కాలంలో మారిన, మారుతున్న వాతావారణ పరిస్థితులకు అనుగుణంగా శరీరాన్ని మలచడం కోసం పూర్వీకులు ఏర్పాటుచేసిన ఆచారం కార్తిక స్నానం. నదుల్లో, సరస్సులు, పారే కాలువలు, జలపాతా లు, బావుల వద్ద స్నానం ఆచరిస్తే చాలా మంచిది. శాస్త్ర ప్రకారం పురుషుడు నదీ ప్రవాహానికి అభిముఖంగా స్నానం చేయాలి. స్త్రీలు వాలుకి చేయాలి.
నదీ స్నానం చేయడానికి వీలుకాకపోతే ఇంట్లోనైనా శాస్త్ర ప్రకారం స్నానం ఆచరిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.
కార్తిక మాసంలో ఈవిధంగా స్నానం చేస్తే సర్వపాపాలు నశించి, శ్రీమ హావిష్ణువు అనుగ్రహంతో సంపదలు పెరుగుతాయి. ”నిత్యే నైమిత్తికే కృష్ణ కార్తికే పాపనాశ” అనే మంత్రం శాస్త్రాలలో ఉంది. అలాగే ఏదైనా మత ప ర మైన పనుల నిమిత్తం నిత్యం స్నానం చేస్తే బాహ్య పాపాలు నశిస్తాయి. కారి ్తక మాసంలో స్నానం చేయడంవల్ల అంతర్గత పాపాలు కూడా నశిస్తాయి. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత నుదుటిపై తిలకం పెట్టుకోవాలి.
కార్తిక మాసంలో నదీ స్నానం చేసి తీరాలి. నదీ స్నానం చేసేటప్పుడు ఒక మాట గుర్తు పెట్టుకోవాలి. కార్తిక మాసంలో నదీ స్నానం చెయ్యడ మంటే పక్కన ఉన్న నదిని వదిలిపెట్టి ఎక్కడో ఉన్న మరో నదిలో స్నానానికి వెళ్ళకూడదు. ఉదాహరణకు కార్తిక మాసంలో గంగా స్నానం చేయాలను కుంటే, ముందు దగ్గరగా ఉన్న నదీ స్నానం చేయాలి. ఆ తర్వాతే గంగా స్నా నం చేయాలి. ఎందుకంటే మనకు అన్నం పెట్టేది మనకు దగ్గరగా ఉండే నదే! అందుకే దగ్గరగా వున్న నదులను ఉల్లంఘించకూడదు. ఎప్పుడైనా ప్రవహంచే నదిని గమనిస్తే- అది రకరకాల శబ్దాలు చేస్తూ, సూక్ష్మంగా తిరు గుతూ రాళ్ళకి గుద్దుకుంటూ, పైనుంచి పడుతూ, పైకి ఎక్కుతూ వెడు తుంది. ఆ సమయంలో అది చేసే ధ్వనులు చిత్రవిచిత్రంగా ఉంటాయి. అలా వెళ్లిపోయే నది నీటిలో చంద్రుడి శక్తి నిక్షిప్తమై వుంటుంది.
ఈ జగత్తును రక్షించే అమ్మవారు ప్రకృతిలో ఒకోసారి ఒకో రూపంలో కనిపిస్తూ ఉంటుంది. చైత్రమాసంలో వేప పువ్వు రూపంలో, కార్తిక మాసంలో ఉసిరికాయ రూపంలో, ఆషాడ మాసంలో గడ్డిపరక రూపం లో అందరినీ రక్షిస్తూ ఉంటుంది.
లోకాన్ని ఉద్ధరిస్తూ అమ్మవారు ప్రమాదాలు ఎక్కడున్నాయో ముందే హచ్చరిస్తుంది. ఆవిడ కార్తిక మాసంలో చంద్రకిరణ రూపంలోనూ, ఉసిరి చెట్టు రూపంలోనూ ఈ ప్రపంచాన్ని ఆదుకుంటూ ఉంటుంది. అందుకే కార్తిక మాసంలో ఉసిరికాయ పచ్చడి తినడం, వనభోజనానికి వెళ్ళి ఉసిరి చెట్టు కింద కూర్చోవటం మంచిదంటా రు. కార్తిక మాసంలో చంద్ర కిరణాల రూపంలో ఉన్న అమ్మవారు నీటిని అమృతధారగా మారుస్తుంది. అందువల్ల అభిముఖంగా నదిలో నిలబడి పరమేశ్వరునికి నమస్కారం చేసి ‘మజ్జనం’ చేయాలి. మజ్జనం అంటే మూడుమార్లు తల ముంచి పైకి లేవాలి. అలా స్నానం చేస్తే శరీరానికంతా చంద్ర కిరణాల వల్ల అమృత స్పర్శ కలుగుతుంది. చంద్ర కిరణాల వల్ల ఓష ధీశక్తి శరీరంలో ప్రవేశిస్తుంది.
అంతేకాక, చంద్ర స్పర్శ కలిగిన తరువాత మనసు సాత్వికమై, పరమే శ్వరారాధనలో సాత్వికమైన బుద్ధితో తేజోవంతమై నిలబడుతుంది. మనసంటే చంద్రుడే. మనసు మీద చంద్ర ప్రభావమే ఉంటుంది. ఈ రెండు సాధనాలను ఏకకాలంలో పొందడానికి కార్తిక మాసంలో నదీ స్నానం ఉప యోగపడుతుంది. ఈ నదీ స్నానం చేయటానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. నదీ స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్టతో స్నానం చెయ్యాలి. నదీ స్నానం చేసేటప్పుడు సంకల్పం లేని స్నానం చెయ్యకూడదు. ”నేను ఫ లానా చోట ఉండి పూజ చేస్తున్నాను, ఆ విషయం ఈశ్వరుడికి తెలియదా? నేను ఎక్కడ ఉండి స్నానం చేస్తున్నానో తెలుసుకోలేనివాడికి నేను పూజ చేయడమేంటి? వాడు సర్వజ్ఞుడేంటి?” అని కొందరు అనుకోవచ్చు. అందుకే సంకల్పం చెప్పేటప్పుడు ఏ పేరెత్తితే పాపనాశనం అవుతుందో పరమేశ్వరుడు దానినే పలికిస్తాడు. అందుకే- ”గంగా కావేరీ యో: మధ్య దేశస్థే, గంగా గోదావరీ యో: మధ్య దేశస్థే ” అని సంకల్పం చెప్పిస్తారు. ఎందుకంటే ఆ నదుల పేరెత్తితే చాలు పాపాలు నశిస్తాయి.
అంత గొప్పదైన నదికి అభిముఖంగా నిలబడి సంకల్పంతో నదీ స్నానం చేస్తే, అది తప్పకుండా రక్షిస్తుంది. అయితే స్నానం చేసి వెళ్లిపోతే సరిపోదు. బయటకు వచ్చిన తర్వాత పుణ్య కర్మాచరణ చెయ్యాలి. అంటే దానమో, ధర్మమో ఏదో ఒకటి తప్పనిసరిగా చెయ్యాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement