Wednesday, May 8, 2024

తిరుమలలో పెరిగిన భ‌క్తుల ర‌ద్దీ..

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తుల రద్దీ కొనసాగుతుంది . శ్రీవారి సర్వదర్శనానికి 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. వీరికి 12 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ వర్గాలు తెలిపాయి. నిన్న స్వామివారిని 63,332 మంది భక్తులు దర్శించుకోగా 26,656 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.2.86 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు. కాగా ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఇవాళ స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేక సేవలో పాల్గొనగా అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement