Saturday, April 27, 2024

అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా మాచర్లలో అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మాచర్ల మండలం కొప్పునూరు గ్రామంలో గురువారం వెలుగు చూసింది. మేకల నాగరాజు (32) తన సొంత పొలం 2.80 ఎకరాలతో పాటు మరో ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద ఎరువుల దుకాణాల్లో అప్పులు చేశాడు రూ.15 లక్షల వరకు అప్పులయ్యాయి. అలాగే పంటలు కూడా సరిగ్గా పండక పోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement