Tuesday, May 7, 2024

యాదాద్రిలో భ‌క్తుల ర‌ద్దీ

యాదాద్రి భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. ఆదివారం సెలవుదినం కావడంతో యాదాద్రికి భక్తజనం పోటెత్తారు. శ్రీ లక్ష్మినరసింహ స్వామివారికి మొక్కులు తీర్చుకోవడానికి బారులు తీరారు. స్వామివారి ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. స్వామి వారి దర్శనం అనంతరం ప్రసాదం కొనుగోలు చేసేందుకు భక్తులు క్యూ కట్టారు. స్వామివారి ప్రసాదం కౌంటర్లు, దర్శనం క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement