Monday, May 20, 2024

పే స్కేల్ అమలు చేయడం లేదని… వీఆర్ఏ ఆత్మహత్య

ఎల్లారెడ్డి : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని నాగిరెడ్డిపేట్ మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన కొరబోయిన అశోక్ (25) వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా పే స్కేల్ అమలు చేయాలని వీఆర్ఏలు సమ్మె నిర్వహిస్తున్నారు. నెల రోజులకు పైగా సమ్మె నిర్వహిస్తున్నా.. పే స్కేలు అమలు కావడం లేదనే మనస్థాపం చెంది శనివారం రాత్రి బొల్లారం గ్రామంలోని చెరువు కట్ట వద్ద ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం త‌ర‌లించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వారి కుటుంబ సభ్యులకు మద్దతుగా ఎల్లారెడ్డి మండల పరిధిలోని వీఆర్ఏలు, ఆయా పార్టీ నేతలు ధర్నా చేపట్టారు. దీంతో ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement