Friday, April 26, 2024

తిరుమలలో భక్తుల రద్దీ..

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు వివిద ప్రాంతాల నుంచి భ‌క్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమ‌ల‌లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 20 కంపార్ట్‎మెంట్లలో వేచి ఉండ‌గా.. సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టనుంద‌ని టీటీడీ అధికారులు తెలిపారు. శనివారం శ్రీవారిని 79,561 మంది భక్తులు దర్శించుకోగా.. 36,784 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement