Sunday, May 5, 2024

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల రద్దీ కొనసాగుతుంది . కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండాయి. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 72,195 మంది భక్తులు దర్శించుకోగా 35,967 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.24 కోట్లు వచ్చిందని వారు వివరించారు. రేపు శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement