Wednesday, May 1, 2024

బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే ను ప్రారంభించిన ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఉత్తర ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. యూపీలోని బుందేల్‌ఖండ్‌లో సుమారు 296 కిలోమీట‌ర్ల ఎక్స్‌ప్రెస్‌వేను ప్ర‌ధాని మోడీ ప్రారంభించారు. యూపీలోని ఏడు జిల్లాల మీదుగా ఈ ర‌హ‌దారి వెళ్తుంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు రూ.15,000 కోట్లు. అయితే, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ-టెండరింగ్‌ను ఎంచుకోవడం ద్వారా దాదాపు రూ.1,132 కోట్లు ఆదా చేసింది. జ‌లౌన్ జిల్లాలోని కైథేరి గ్రామంలో ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

ఫిబ్ర‌వ‌రి 29, 2020లో ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం కోసం ప్ర‌ధాని మోడీ శంకుస్థాప‌న చేశారు. కేవ‌లం 28 నెల‌ల్లోనే ఈ హైవేను నిర్మించారు. చిత్ర‌కూట్ జిల్లాలోని గోండా గ్రామం వ‌ద్ద ఎన్‌హెచ్‌-35తో ఈ హైవే క‌లుస్తుంది. ఆ త‌ర్వాత ఇటావా జిల్లాలోని కుద్రాలి గ్రామం వ‌ర‌కు ఎక్స్‌ప్రెస్ వే ఉంటుంది. అక్క‌డ ఆగ్ర‌-ల‌క్నో ఎక్స్‌ప్రెస్‌వేతో క‌లుస్తుంది. తొలుత దీన్ని ఫోర్‌లేన్ రూట్‌గా నిర్మించారు. త‌ర్వాత సిక్స్ లేన్స్‌గా మార్చే అవ‌కాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement