Monday, April 29, 2024

తిరుమ‌ల‌లో కొన‌సాగుతున్న భ‌క్తుల ర‌ద్దీ..

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పోటెత్తారు. తిరుమ‌ల‌లో స్వామి వారి ద‌ర్శ‌నం కోసం భారీ సంఖ్య‌లో భ‌క్తులు కంపార్ట్ మెంట్ల‌లో వేచిఉన్నారు. వీరికి గంట‌ల త‌ర‌బ‌డి స‌మ‌యం ప‌డుతుండ‌డంతో అధికారులు భ‌క్తుల‌కు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం తిరుమల శ్రీవారిని 61,112 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 18 వేల మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.19 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement