Tuesday, March 26, 2024

ఘోర రోడ్డుప్ర‌మాదం .. ఆరుగురు మృతి

ఘోర రోడ్డుప్ర‌మాదంలో ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందిన విషాద ఘ‌ట‌న‌ కర్ణాటకలోని బెలగావి జిల్లాలో జరిగింది. జిల్లాలోని చుంచునూరు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన మహింద్రా బొలేరో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న మర్రిచెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. ప్రమాదం ధాటికి వాహనం నుజ్జునుజ్జుయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. బాధితులంతా హులకుంట గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement