Thursday, May 16, 2024

తిరుమ‌ల‌లో కొన‌సాగుతున్న భ‌క్తుల ర‌ద్దీ… శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. భక్తుల దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న శ్రీవారిని 58,747 మంది భక్తులు దర్శించుకోగా 28,496 తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.79 కోట్లు వచ్చిందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement