Saturday, April 27, 2024

శ్రీరామ పునర్వసు దీక్షలు ప్రారంభం

భద్రాచలం, ప్రభ న్యూస్‌ : శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శ్రీరామ పునర్వసు దీక్షలు ప్రారంభమయ్యాయి. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ భక్తులు దీక్షలును స్వీకరిస్తున్నారు. డిసెంబర్‌ 21 తేదీన శ్రీరామ పునర్వసు దీక్షలు విరమణ ఉంటుందని ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గిరి ప్రదక్షిణ, రాత్రి 7 గంటలకు వెండి రథోత్సవం. 22న ఉదయం 11 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు. భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని ఆలయ అధికారులు సూచిస్తున్నారు. సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement