Thursday, April 18, 2024

క‌విత‌కి వినూత్నంగా విషెష్..ఆకాశంలో 40అడుగుల క‌విత ఫోటోతో కూడిన ఫ్లెక్సీ..

సినిమా వాళ్ళ‌కే కాదండోయ్..రాజ‌కీయ నేత‌ల‌కు అభిమానులు ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. కాగా రీసెంట్ గా నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీకి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఈ సందర్భంగా ఆమెకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశాడు ఒక అభిమాని. నిజామాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు సాయి ప్రసాద్ కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద పారాగ్లైడింగ్ ద్వారా భారీ ఫ్లెక్సీతో విషెస్‌ తెలిపారు. 40 అడుగుల కవిత ఫోటోతో కూడిన ఫ్లెక్సీని ఆకాశంలో ఎగరవేశారు. ఈ దృశ్యాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement