Sunday, May 19, 2024

శ్రీవారి దర్శనానికి సంఖ్యను పెంచుతాం

టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల, ప్రభ న్యూస్‌: దేశ వ్యాప్తంగా కరో నా వ్యాప్తి తగ్గుముఖం పడుతున్న నేప థ్యంలో త్వరలోనే దశలవారీగా దర్శ నాల సంఖ్యలను పెంచు తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆది వారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారి ఆలయం ముందు విలేకరులతో మాట్లాడుతూ, మన రాష్ట్రం లో కూడా కరోనా కేసుల సంఖ్య తగ్గినా సరిహద్దు జిల్లాకావడంతో రాష్ట్రం లోకే చిత్తూరుజిల్లాలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయన్నారు. అధికారులతో చర్చించి మరో మూడు రోజుల్లో దర్శనాల సంఖ్య పై నిర్ణయం తీసుకుంటామని, నడక దారి భక్తులకు టోకెన్లు జారి చేస్తామన్నారు. పలు అర్జిత సేవలను కూడా భక్తులకు అనుమతిం చడం పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement