Friday, April 26, 2024

దర్శన టికెట్లు ఉంటేనే తిరుమలకు అనుమతి

తిరుమల, ప్రభన్యూస్‌ : దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించడం జరుగుతుందని, కొవిడ్‌ వ్యాప్తి నివారణలో భాగంగా భక్తులు, ఉధ్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ కాని దర్శనానికి 72 గంటల ముందు చేసుకున్న ఆర్టిపిసిఆర్‌ పరీక్ష నెగిటివ్‌ సర్టిఫికెట్‌ కాని తప్పనిసరిగా తీసుకురావాలని టిటిడి విజ్ఞప్తి చేసింది. పలువురు భక్తులు దర్శన టికెట్లు లేకుండా స్వామివారి దర్శనం కోసం వస్తుండడంతో అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద సిబ్బంది తనిఖీ చేసి వెనక్కు పంపుతున్నారని పేర్కొంది. కావున భక్తులు ఈ విషయాలను గమనించి టిటిడికి సహకరించాలని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement