Sunday, April 28, 2024

యంగ్ టైగర్ చేతులమీదులగా తిమ్మరుసు ట్రైలర్

కరోనా కారణం చాలా రోజుల నుంచి సినిమా థియేటర్లు మూత పడ్డాయి. అయితే ఇప్పుడు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి. అయితే ఈసారి మొదటగా జూలై 30న యంగ్ హీరో సత్యదేవ్ తిమ్మరుసు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను కూడా చిత్ర యూనిట్ పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ జారీ చేసింది.

ఇక ఇందులో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే బ్రహ్మాజీ, రవిబాబు, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ను నేడు రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలకు ఈ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement