Thursday, May 16, 2024

Shruti Hasan : బోర్ కొట్టిన‌ప్పుడ‌ల్లా దానిమీద‌కు ఎక్కేస్తాను..

శృతిహాసన్‌ను పాన్‌ ఇండియా స్టార్‌గా పేర్కోవచ్చు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో పాటుగా హాలీవుడ్‌ సినిమాలు కూడా చేస్తోంది. పరిచయం వరకే వారసత్వం.. ఆ తర్వాత సొంతంగా పేరు తెచ్చుకుంది కమల్‌ హాసన్‌ తనయ శృతిహాసన్‌. ఎక్కువ సినిమాలు కాకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తోంది. క్రాక్‌ సినిమా విజయంలో కీలకభూమిక పోషించిన శృతికి తెలుగులో ఈ ఏడాది ప్రారంభంలో రెండు హిట్‌ సినిమాలు చేసింది. చిరంజీవి, బాలకృష్ణలతో ఒకే సారి నటించడం, ఆ రెండు చిత్రాలు సైతం సంక్రాంతికి రావడం విశేషంగా పేర్కోవచ్చు. శృతిహాసన్‌ ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్‌ సినిమాలో నటించింది. ఈ చిత్రం డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరోవైపు ఆంగ్లంలో ‘ది ఐ’ అనే సైకలాజికల్‌ థ్రిల్లర్‌లో నటిస్తోంది. తను ఎంత బిజీగా ఉన్నా సరే అభిమానులతో సోషల్‌ మీడియా ద్వారా విశేషాలు అందిస్తూ ఉంటుంది. ఇటీవలే తన అభిమానులతో ముచ్చటించింది. వారితో పలు ఆసక్తికరమైన విషయాలుు పంచుకుంది. ఎప్పుడూ ఒకేచోట స్థిరంగా ఉంటే జీవితం బోరుగా ఉంటు-ంది అం టూ మనిషి ఎప్పటికప్పుడు రీచార్జ్‌ కావాలని చెప్పిం ది. బోర్‌ అనిపించినప్పుడు కొత్త ప్రదెశాలకు వెళు తుంటానని చెప్పింది. కారో, బ‌స్సులో, విమానం మీద‌కో ఎక్కేసి చెక్కేస్తానంటున్న‌ది. దీనివల్ల తనలో కొత్త ఉత్సా హం వచ్చి చేరుతుందని పేర్కొంది. కొత్త ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లడానికి ప్రాధాన్యత ఇస్తా నని, అందులేనే అసలైన కిక్కు ఉందని శృతి తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement