Friday, May 3, 2024

అనాధాశ్రమంలో.. లావ‌ణ్య త్రిపాఠి

హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తుంది లావణ్య. తాజాగా ఈ ముద్దుగుమ్మ అనాధాశ్రమంలో సందడి చేసింది.అనాధాశ్రమంలో అనాధ పిల్లలతో సందడి చేసింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. హైదరాబాద్ లోని అనాథ విద్యార్థి గృహాన్ని సందర్శించి వారితో సరదాగా గడిపింది. విద్యార్థుల జీవితాలు తనకు ఎంతో స్ఫూర్తిని కలిగించాయని ఆనందం వ్యక్తం చేసింది లావణ్య. విద్యార్థులతో కలిసి సరదాగా మాట్లాడిన లావణ్య వారితో కలిసి భోజనం చేసింది. ఆ విద్యార్డుల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా అని తెలిపింది లావణ్య. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లావణ్య మంచి మనసు తెలుసుకొని ప్రేక్షకులు ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement