Wednesday, May 15, 2024

Guntur karam ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఫిక్స్

గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న (శనివారం) హైదరాబాద్‌లో జరగాల్సి ఉండగా భద్రతా కారణాల దృష్ట్యా అనుమతి ఇవ్వలేదు. దీంతో ఈవెంట్‌ని పోస్ట్‌పోన్ చేయడంతో.. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులందరికీ ఇది తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక దీంతో ఇవ్వాల (ఆదివారం) సాయంత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అయితే, దాంతో పాటు మహేష్ అభిమానులను ఆకట్టుకుఇనే ఓ గుడ్ న్యూస్ ఒకటి ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఫిక్స్ అయ్యింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరగనునున్నట్టు ఈవెంట్ నిర్వాహకులు ధృవీకరించారు.

ఈవెంట్ జనవరి 9న జరిగే ఛాన్స్ ఉంది.. కాగా, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం మాస్ యాక్షన్ డ్రామా. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్గీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా, థమన్ సంగీతం అందించాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రం జనవరి 12, 2024న విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement