Sunday, May 5, 2024

Nizamabad – ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లో వచ్చా – ధన్ పాల్

నిజామాబాద్ సిటీ, జనవరి (ప్రభ న్యూస్)7: ప్రజలు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఆదివారం నిజామాబాదు నగర శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ అర్బన్ శాసనసభ్యులుగా ఎన్నికై నందుకుదుకు హైదరాబాద్ లోని చందానగర్ లోతెలంగాణ వాసవి ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన సభ కార్యక్రమానికి ధంపాల్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు ఈ సంద ర్బంగా ఆయ‌న‌ మాట్లాడుతూ, సమాజ సేవ చేయడానికి వాసవి మత బిడ్డగా ప్రజలకు నిత్యం సేవ చేస్తూ అందరి మన్ననలు పొందూతు ఉన్నామని అన్నా రు.

కేంద్రం లో మోదీ ఓబీసీ రెసర్వేషన్ ద్వారా ఎంతో మంది ఆర్యవైశ్య సోదరా, సోదరి మనులకు లాభం చేకూరింద న్నారు. అర్బన్ లో భారీ మెజా ర్టీ తో గెలిపించిన ప్రజలకు చీర స్థాయి గా గుర్తుండేలా అభివృధి పనులు చేస్తా అన్నారు. ట్రస్ట్ ద్వారా అనేక సేవ కార్యక్రమాలు చేస్తూ ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఒక సైనికుడిగా పనిచేస్తున్న అన్నారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ వాసవి ఐక్యవేదిక ప్రతినిధులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement