Sunday, April 28, 2024

ఇచ్చట వాహనాలు నిలుపరాదు…సెన్సార్ పూర్తి

అక్కినేని హీరో సుశాంత్ ప్రధానపాత్రలో ఎస్ దర్శన్ దర్శకత్వంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం ఇచ్చట వాహనాలు నిలుపరాదు. వాస్తవ సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఆగస్టు 27న థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, వెంకట్ కీలక పాత్రలో నటించారు.

కాగా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రంకు సెన్సార్ బోర్డు యూ/ ఏ సర్టిఫికేట్ ను ఇచ్చింది. ఇక ఎప్పటి నుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న సుశాంత్… ఈ సినిమాతో అయినా హిట్ కొడతాడో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement