Sunday, April 28, 2024

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అయిన ‘‘వీరసింహారెడ్డి’’

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన లెటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వీరసింహరెడ్డి’. జనవరీ 12 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టి, బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.

కాగా, ఇప్పుడు ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అవుతోంది. త్వరలో స్టార్ మా లో ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించనుంది. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లోవరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్, దునియా విజయ్ లు కీలక పాత్రల్లో నటించారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement