Thursday, May 2, 2024

యాదాద్రి ఆలయంపై డ్రోన్‌.. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అధికారుల అనుమతి లేకుండా డ్రోన్‌ను ఎగరవేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన యాదాద్రి పోలీసులు. హైదరాబాద్ సరూర్‌నగర్‌కు చెందిన నక్కల సాయి కుమార్ (22), యార్లగడ్డ మనీష్ కుమార్ (21)లను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ ద్వారా చిత్రీకరించడం నిషేధించబడినప్పటికీ, ఆలయ ప్రాంగణంలో డ్రోన్‌లు ఎగురుతున్నట్లు చూసిన ఆలయ అధికారులు తమను అప్రమత్తం చేశారని పోలీసులు తెలిపారు.

అధికారుల అనుమతి లేకుండానే డ్రోన్‌లు ఎగరవేసిన వీరిద్దరిని.. ఆలయ సిబ్బంది అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది సహకారంతో నిందితుల కోసం వెతికి, కొండ గుడిపై ఉన్న బస్ స్టేషన్ దగ్గర వారిని పట్టుకున్నట్టు యాదాద్రి ఇన్‌స్పెక్టర్‌ సైదయ్య తెలిపారు. అయితే, పట్టుపడ్డ నిందితులు సినిమాటోగ్రఫీ కోర్సును అభ్యసిస్తున్నారని విచారణలో వెల్లడైందని ఆయన తెలిపారు. కాగా, ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈవో) ఫిర్యాదు మేరకు యాదాద్రి పోలీసులు కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement