Wednesday, May 15, 2024

మదిలో మదిలో ట్విస్టులుంటాయి

జయ కుమార్‌, శీను, స్వీటీ-, సిరి రావుల చారి, సునీతలు ప్రధాన పాత్రల్లో నటించిన ప్రేమ కథా చిత్రం ‘మదిలో మది’. నేముకూరి జయకుమార్‌ నిర్మాతగా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాకు ప్రకాష్‌ పల్ల దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఇదేనెల 18న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో సినిమా యూనిట్‌ ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించింది.

హీరో జయ కుమార్‌ మాట్లాడుతూ..నేను ఒక డ్రైవర్‌ని, అసిస్టెంట్‌ని. ఓ యాక్టింగ్‌ స్కూల్‌లో ప్రకాష్‌ పరిచయం అయ్యాడు. మా ఇద్దరి స్నేహం వల్లే ఈ సినిమాను తీశాం. సినిమా కొత్తగా ఉంటు-ంది. అన్నారు.

హీరోయిన్‌ సిరి మాట్లాడుతూ.. మంచి ప్రేమ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం ఆనందంగా ఉంది. అని అన్నారు.

దర్శకుడు ప్రకాష్‌ పల్ల మాట్లాడుతూ..ఈ సినిమా కోసం టీ-ం అంతా రాత్రిపగలూ కష్టపడ్డాం. క్రాంతి నీలా ఇచ్చిన విజువల్స్‌ అద్భుతంగా ఉంటాయి. డీఐ, సౌండింగ్‌ అన్నీ బాగా వచ్చాయి. మా టీ-ంలో అందరూ కష్టపడి కాదు ఇష్టపడి సినిమాను చేశారు. సినిమాను తప్పకుండా చూసి సక్సెస్‌ చేయండి అని అన్నారు.

- Advertisement -

ముఖ్యఅతిథిగా పాల్గొన్న తాగుబోతు రమేష్‌ టీమ్‌కు శుభాకాంక్షలు

Advertisement

తాజా వార్తలు

Advertisement