Saturday, May 18, 2024

Delhi | గవర్నర్ బండారు దత్తాత్రేయతో చంద్రబాబు నాయుడు భేటీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఉత్తరాది పర్యటనలో ఉన్న ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి సోమవారం దత్తాత్రేయను మర్యాదపూర్వకంగా కలిశారు. దత్తాత్రేయ, ఆయన సతీమణి వసంతను శాలువాతో సత్కరించి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని బహూకరించారు. ఛండీగఢ్‌లోని గవర్నర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో దత్తాత్రేయ-చంద్రబాబు నాయుడు పలు అంశాలపై చర్చలు జరిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement