Sunday, April 28, 2024

మూడో చిత్రానికి శ్రీకారం

‘రౌడీ బాయ్స్‌’ తో హీరోగా తెరంగేట్రం చేసిన ఆశిష్‌ ‘సెల్ఫీష్‌’ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికి పైగా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ సినిమా సెట్స్‌ పై ఉండగానే ఆశిష్‌ మూడో చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ మూవీ రొమాంటిక్‌ హారర్‌ బ్యాక్‌ డ్రాప్‌ తో తెరకెక్కనుంది. హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డిలతో పాటు- నాగార్జున మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అరుణ్‌ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఈ సినిమా ప్రారంభోత్సవానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో చినబాబు, నాగవంశీ తదితరులు హాజరయ్యారు. కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు పి.సి.శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ, అవినాష్‌ కొల్ల ఆర్ట్‌ వర్క్‌ అందిస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement